27, సెప్టెంబర్ 2022, మంగళవారం

యువభారతి తో నా అనుబంధం

 ~ యువభారతి తో నా అనుబంధం~~


  స్వాతి ప్రారంభసంచికలో గౌరవసంపాదకునిగా శీలా వీర్రాజు గారి పేరు చూసి అభిమానిగా ఆయన రచనలగురించి నేను ఉత్తరం రాస్తే నాకు వారి కవితా సంపుటాలతో పాటు యువభారతి ప్రచురణ అయిన పంచవటి అనే అయిదుగురు కథకుల సంకలనాన్ని పంపించారు.అదే యువభారతితో పరోక్షంగా నామొదటిపరిచయం.

       తర్వాత "చుట్టూరా ఆవరించుకుని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది" అనే యువభారతి ఆశయం నన్ను ఆకర్షించింది.

         మంచి ఆశయంతో ధ్యేయంతో 1963లో విజయదశమి అక్టోబరు 27 నాడు ఇరివెంటి కృష్ణమూర్తిగారు దీనిని స్థాపించి అధ్యక్షుడిగా యువభారతి ఆవిర్భవించిందనే విషయాన్ని వివాహానంతరం ఆయన ద్వారా విన్నాను.

      యువతరంలో సమాజహితం , సాహిత్య అభ్యుదయం పెంపొందింప చేయటానికి ప్రతీనెలా మొదటి ఆదివారం కృషిచేస్తుండేదని వీర్రాజు గారు చెప్తూఉండేవారు.సాహిత్యంపట్ల,ఆసక్తీ,పఠనాభిలాషని పెంపొందించే విధంగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించటమే కాకుండా ముఖ్యంగా తెలుగు భాషా విద్యార్థులకు సౌమనస్యం, సౌజన్యం , ఉన్నత భావాలను, నిర్మాణాత్మకమైన రీతిలో వ్యక్తిత్వాన్ని రూపొందించుకునేలా ప్రోత్సహిస్తుండేదనేది విని మరింత పులకించాను.

          వీర్రాజు గారు ఉత్తరాల్లో ఎప్పటికప్పుడు యువభారతి కి వేయాల్సిన ముఖచిత్రాల గురించి చెప్తుండేవారు

     

      వేసవి సెలవులకు హైదరాబాద్ వచ్చినరోజుల్లో నాకు చాలా సంతోషం కలిగించేదీ ఎదురుచూసేది ఆదివారం సాయంత్రం.ఎందుకంటే ఆదివారం రోజు ఆంధ్ర సారస్వత పరిషత్తులో యువభారతి నిర్వహించే కావ్యలహరి ఉపన్యాస పరంపర ఉంటుండేది. ఎప్పుడూ సాహిత్యసభలకు వెళ్ళలేదేమో నాకు ఉత్సాహంగా ఉండేది. కావ్యలహరి పేరిట మనుచరిత్ర ,పారిజాతాపహరణము ,వసుచరిత్రము ,విజయవిలాస కావ్యాలపై ఉపన్యాస పరంపరగా ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారితో ఉపన్యాసాలను యువభారతి సారథులు ఇరివెంటి కృష్ణమూర్తి గారు,వంగపల్లి విశ్వనాధం గారూ నిర్వహించేవారు. 

       ప్రాచీన సాహిత్యం మీదే ఉపన్యాసాలు ఉన్నా గంభీరస్వరంతో ఆయన పద్యాలు చదువుతూ వివరించటం అద్భుతంగా అనిపించేది.మొదట్లో పరిషత్తు హాలులోనే జరిగే సభలకు తర్వాత్తర్వాత అశేషంగా జనం వచ్చి వరండాలోను బయటా నిండిపోవటమేకాక ముందు ఖాళీ ప్రదేశం లోనూ నిలబడి వినేవారు.దాంతో పరిషత్తు వెనుక ఓపెన్ వేదిక పై ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు.

          ఉపన్యాసాలు సరేకానీ వాలంటీర్లుగా ఆ సమావేశం ఆవరణంతా గలగలా సందడిగా ఉత్సాహంగా ఎగిరే సీతాకోక చిలుకల్లా తిరిగే యువతీయువకులను చూస్తుంటే నాకు నా కాలేజీ గుర్తువచ్చి గుబులుఅయ్యేది.వాళ్ళంతా కూడా సుమారుగా నా వయసు వాళ్ళు కావటం వలన వాళ్లలో నన్ను చూసుకుని మళ్ళా అలా తిరగ్గలనా అనిపించేది.చెవులు ఉపన్యాసం వింటున్నా ,నా చూపులు వారి వెనకెనకే తిరిగేవి.

           తర్వాత్తర్వాత ఆ యువభారతీయులైన 

సుధామ,నాగినేని భాస్కర్రావు,కె.బి.లక్ష్మి, కామేశ్వరరావు,రత్నమాల మొదలైన వారంతా మాకు కుటుంబమిత్రులు అయ్యారు.

     యువభారతి ప్రచురణలు వందకి పైగానే ముఖచిత్రాలు వీర్రాజే వేసారు.మాపరిచయం అనంతరం మొదలుపెట్టిన వచన

కావ్యం వివాహం తర్వాత పూర్తి చేసారు.అదే వీర్రాజుగారు రాసిన తొలి దీర్ఘ కావ్యం” మళ్ళీవెలుగు “నాకే అంకితం చేసారు. యువభారతి ప్రచురించిన మళ్ళీ వెలుగు కావ్యం ఉగాది రోజున జరిగింది. ఈ పుస్తకావిష్కరణ సభ కి 1973 లో మూడునెలల పసిపాప పల్లవిని తీసుకొని హాజరయ్యాను.మాదంపతులకు యువభారతి సంస్థతో చిరకాల అనుబంధం నేటికీ కొనసాగుతూనే ఉంది.

    1980 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా నేను తెలుగు ఎమ్మే చేసినప్పుడు యువభారతి ప్రచురణలే నన్ను ఆదుకున్నాయి.ఎందుకంటే అప్పట్లో మూడేళ్ళ మానసిక వికలాంగుడైన బాబుతో అంతర్ముఖీనమై ఒత్తిడికి గురైన స్థితిలో నేను బయటకు వెళ్ళలేక వీర్రాజు గారు ఇచ్చిన యువభారతి పుస్తకాలు, ఆరుద్ర సమగ్ర సాహిత్యం మాత్రమే చదివి రెండవ తరగతిలో ఉత్తీర్ణత సాధించానంటే యువభారతి ప్రచురణలు తెలుగు సాహిత్యానికి ఎంతటి సమగ్రమైన గ్రంథాలు అందించాయో అర్థమౌతుంది..


     వీర్రాజు గారు యువభారతి ముఖచిత్రాలు వేస్తున్నప్పుడు ఎంతో తపోనిష్టతో వేయటం నేను చూసాను. అందులోనూ కావ్యాలహరికి శిల్పవిన్యాసంలా అర్థవలయాకృతిలో వేసిన ముఖచిత్రం మర్చిపోలేనిది.అది నాకెంతో నచ్చిన ముఖచిత్రం.సాహితీవేత్తలకూ,సావనీర్లకూ,ప్రభుత్వసంస్థలకూ చాలానే వేసినా యువభారతి అనే ఒకేఒక సాహిత్యసంస్థకు వందకి పైగా ముఖచిత్రాలు వేయటం అన్నది ఒక రికార్డుగా చెప్పుకోదగినది.

  అటువంటి యువభారతి సంస్థ ఈనాడు షష్ట్యబ్ది ఉత్సవం చేసుకొంటున్న సందర్భంలో ఈసంస్థతో విడదీయరాని బంధం గల శీలా వీర్రాజు గారి స్థానంలో నేను ఈ నాలుగు మాటలు రాస్తున్నందుకు ఒక కంట కన్నీటితో,మరోకంట ఆనందంతో హృదయపూర్వక అభినందనలు 

  తెలియజేస్తున్నాను.

7, సెప్టెంబర్ 2022, బుధవారం

నడక దారిలో,19

నడక దారిలో -- 19


      నా కొత్త కాపురం యథాతథంగా కొనసాగుతోంది.

మా ఇంట్లో కూడా నాకు మాఅన్నయ్యలతో ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు.ఎవరిపనులు వాళ్ళు చేసుకోవటమే.అమ్మకి ఇంటిపనుల్లో ఏదైనా సాయం అవసరం అయితే చేయటం తర్వాత చదువుకోవటం లేకుంటే బొమ్మలు వేసుకోవటం చేసేదాన్ని.ఇంట్లో రేడియోలో ఏదోఒకటి వస్తూనే ఉంటుంది.అదే సందడి.లేదా నేను తీసే రాగాలే ఇల్లంతా తీగలు సాగుతూ ఉంటాయి.

        ఇక్కడ మా ఇంటికాంపౌండ్ లో మాఇల్లే పక్కా ఇల్లు.మాది కాకుండా మరో నాలుగు వాటాలు రెండు గదుల రేకుల ఇళ్ళు ఉండేవి.వాటిలో ఒకటి రామకృష్ణ శర్మ అనే మాష్టారి కుటుంబం ఉంటుంది. మరోదాంట్లో మహరాష్ట్రియనులకుటుంబం భార్యాభర్తలు ముగ్గురు పిల్లలు కాక ఇంట్లో తల్లితండ్రులు, తమ్ముడు రెండు గదుల్లో సర్దుకుని ఉండేవారు.అంతమంది అంతా చిన్న ఇంట్లో ఎలా సర్దుకునే వారో అనిపించింది. అప్పట్లోనే అతని తమ్ముడికి పెళ్ళి జరగటం గృహహింస అనేది ప్రత్యక్షంగా వాళ్ళింట్లో చూసాను ఆ కుటుంబం నేపథ్యంగా "కంచికి పోని కథ" పేరుతో1980లో ఒక కథ కూడా రాసాను.

        మావంటిల్లు ఆనుకొనిఉన్న వాటాలో చిన్న కుటుంబం కాపురం ఉండేది.వాళ్ళు ఖాళీ చేయాలనుకుంటున్నారు అనీ నేను చదువు ముగించి కొని వచ్చేనాటికి ఆ వాటా కూడా మనం అద్దెకి తీసుకుంటే మనకి వంటింట్లో పడుకునే బాధ తప్పుతుంది అని వీర్రాజు చెప్పేవారు. ఇంకొక వాటాలో రత్నం అనే ఆమె,భర్తా,కొడుకు కాపురం ఉండేవారు.

     పైన వాటాలో సింధీ కుటుంబం అద్దెకి ఉండేవారు.

నాకు వచ్చిన సమస్య రత్నం తో.అత్త పోయినప్పుడు.,ఆ తర్వాత వీళ్ళకు సాయం చేసి ఉంటుంది.అందుకని వీళ్ళంతా ఆమె అంటే అభిమానం పెంచుకున్నారు.దానిని అలుసుగా తీసుకుని ఇంట్లో పెత్తనం చేసేది.

          వీర్రాజు ఉన్నప్పుడు రత్నం అంతగా వచ్చేది కాదు.ఆయన వెళ్ళగానే వచ్చి నేను ఏ పుస్తకమో పట్టుకుని ఉంటే "కాలేజీ స్టూడెంట్ వదిన గారూ చదువు కుంటున్నారా “ అనేది.ఆ అనటం లోని వెటకారానికి మళ్ళా పుస్తకం తీయాలనిపించేది కాదు.

      నేను అప్పుడే బయటగదిలో ఉండి ఆడబడుచు ఒక్కతే వంటింట్లో గానీ ఉందంటే “ ఏంటి సత్యవతీ వదిన వచ్చినా ఆమెని కూర్చోబెట్టి నువ్వే పనంతా చేస్తున్నావా “ అనేది.దాంతో నేను పనంతా పూర్తయ్యే వరకూ వంటింట్లోనే పని ఉన్నా లేకపోయినా ఆడబడుచు తోనే వుండేదాన్ని.

   నేను మొదటినుంచీ బలహీనంగా ఉండి బరువైన ఇంటిపనులు చేయలేకపోయేదాన్ని.అందుకని నేను చదువుకి విజయనగరం వెళ్ళినా ఇబ్బంది లేకుండా చివరి ఇంట్లోని మాస్టారి ఇంటికి వచ్చే చాకలిని దుప్పట్లు.మగవారి బట్టలు ఉతికేందుకు మాట్లాడాను.వారానికిఒకసారి తీసుకువెళ్ళి ఉతికి ఇచ్చేవాడు.

      అలాగే పనిమనిషిని బాసాన్లు తోమించటానికి మాట్లాడాను.ఇంట్లో మగవాళ్ళకి ఆడవాళ్ళు చేసేఇంటిపని మీద అవగాహన లేకపోవటంతో అంతకుముందు పనంతా ఆడబడుచు మీద పడింది.అందుకు కూడా రత్నం “ కొత్త కోడలు రాగానే పనిమనిషిని కుదిర్చారే అన్న “అని వెటకారం చేసింది.అదేమీ నేను పట్టించుకోలేదు.

       నా చదువు గురించి ఎక్కడా చదవాలనే తర్జన భర్జనల నేపధ్యంలో పక్కింటి రత్నం మా ఆడబడుచును " నేను కూడా చదువుకుంటాను అని మీ అన్నయ్యని అడుగు" అని ఎగసిన దోసింది.నేను కూడా చదవమనే ప్రోత్సహించాను.కానీ ఆమెకే ఆసక్తి లేనందున ముందుకు సాగలేదు."ఇంట్లో వీణ ఉంది, సంగీత కళాశాల దగ్గర లోనే ఉంది కదా అదన్నా నేర్చుకోమ"ని చెప్పాను.అదీ చేయలేదు.

        అన్నిటి కన్నా పెద్ద సమస్యే మరొకటి.

వంటింట్లోనే ఒక మూల దేవుడి పీఠం ఉంది .మా పెద్దమరిది కృష్ణ రోజూ దీపం పెడతాడు.ఐతే మేము వంటింట్లోనే పడుకోవటం వలన చీకటిలో కాలు దేవుడి పీఠానికి తగులు తుందేమో అని ఒక స్టాండ్ కొని ఆ మూలే గోడలకి కొట్టించి దేవుణ్ణి పైకి ఎక్కించాను.

        మా ఆడబడుచు బహిష్టు ఐనప్పుడు వంటింట్లోకి వెళ్ళేది కాదు.దాంతో పక్కింటి రత్నం వచ్చి అన్నం మా స్టౌ మీదే వండి కూరలు తెచ్చి ఇచ్చేదిట.నాకు అలా విడిగా ఉండటమూ నచ్చదూ,ఒకరిమీద ఆధారపడటమూ నచ్చదు.అంతే కాక అందరికీ అడ్వర్టైజ్ చేసేటట్లు నేనైతే ఉండను అని చెప్పి మా ఆడబడుచును ఇప్పుడు దేవుడు పైకే ఉన్నాడు కదా అని కోప్పడి మామూలుగా ఇంట్లోను తిరగటం అలవాటు చేసాను.తన మీద ఆధారపడకుండా చేసానని రత్నం నామీద కోపం పెంచుకుంది.

ఇదిగో ఇలాంటి వారి వల్లే అత్తాకోడళ్ళ మధ్యా, వదినామరదళ్ల మధ్యా,తోటికోడళ్ళ మధ్యా సంబంధాలు చెడిపోతాయి అనిపించింది.

         మరొక సమస్య మావాళ్ళు ఒకషాపులో అవసరమైన వెచ్చాలు అరువుగా తెచ్చుకుని జీతం వచ్చాక ఎంతో కొంత చెల్లు పెట్టేవారు.నాకు నచ్చని విషయం అదొక్కటి. దీనివల్ల వచ్చిన డబ్బుని పొదుపుగా వాడటం తెలియకుండా అవుతుంది.మేము తెచ్చుకున్న వస్తువుల బిల్లు అంతకన్నా రెట్టింపుగా అవుతూ ఎప్పుడూ బాకీ తీరకుండా ఉండటం గమనించాను.బహుశా మా అరువు అక్కౌంటులోనే ఎవరో తీసుకుంటున్నారని నాకు అనుమానం వచ్చింది.ఇప్పుడు నేనున్న ఈ రెండు మూడు నెలలకు దాన్ని పట్టించుకోవటం ఎందుకని ఊరుకున్నాను

      నిర్విరామంగా నానోట ఏదో ఒక పాట కూనిరాగాలుగా తీగెలు సాగుతూ

 వెలువడుతూనే ఉండేది.ఒక్కొక్కప్పుడు కాలేజీలో ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కూడా లాబ్ లో కూనిరాగాలు తీసేదాన్ని.అటువంటిది ఇక్కడికి వచ్చాక నా కంఠానికి తాళం పడింది.

       రాత్రిపూట వీర్రాజు పడుకోవటానికి వచ్చేవరకూ ఓగంటో రెండుగంటలో నేను చదువుకోటానికైనా,రాసుకోటానికైనా,బొమ్మలేసుకోటానికైనా నాదైన సమయం ఉండేది.ఇంట్లో బాపు బొమ్మలతో జనార్దనాష్టకం చూసీ భలే ఆనందం అనిపించింది.ఆ తీరిక సమయంలోనే ఆ బొమ్మలను చూసి అన్నీ వేసాను. అవి చూసి వీర్రాజే కాకుండా మిత్రులు కూడా అచ్చం బాపు చిత్రాలు లాగే ఉన్నాయని అనేవారు.ఒకసారి హైస్కూల్ లో చదివే రోజుల్లో విజయనగరం కోటలోని రౌండ్ మహాల్ లో బాపూ బొమ్మలు ప్రదర్శించారు.అవి చూసిన దగ్గర నుండి సీరియల్స్ కి వేసిన చిత్రాలు వేయటం అలవాటు.జనార్దనాష్టకం లోని నేను వేసిన చిత్రాన్ని ఒకనెల స్వాతి పత్రిక ముఖచిత్రం గా కూడా వేసారు.

      నాకు చాలా సంతోషం కలిగించేదీ ఎదురుచూసేది ఆదివారం సాయంత్రం.ఎందుకంటే ఆదివారం రోజు ఆంధ్ర సారస్వత పరిషత్తులో యువభారతి నిర్వహించే కావ్యలహరి ఉపన్యాస పరంపర ఉంటుంది.దానికి మాత్రం ఇంట్లో వాళ్ళనందరిని బయల్దేరదీయరు.అయితే మేమిద్దరమే వెళ్ళేదీ తక్కువే.ఎందుకంటే సెలవురోజు కనుక మధ్యాహ్నమే సాహితీ మిత్రులు వచ్చి ఉండేవారు.ఎప్పుడూ సాహిత్యసభలకు వెళ్ళలేదేమో కావ్యలహరి పేరిట

మనుచరిత్ర ,పారిజాతాపహరణము ,వసుచరిత్రము ,విజయవిలాస కావ్యాలపై ఉపన్యాస పరంపరగా ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారి తో ఉపన్యాసాలను  యువభారతి సారథులు ఇరివెంటి కృష్ణమూర్తి గారు,వంగపల్లి విశ్వనాధం గారూ నిర్వహించేవారు. 
       ప్రాచీన సాహిత్యం మీదే ఉపన్యాసాలు ఉన్నా గంభీరస్వరంతో ఆయన పద్యాలు చదువుతూ వివరించటం అద్భుతంగా అనిపించేది.మొదట్లో పరిషత్తు హాలులోనే జరిగేవి. కానీ సభకు అశేషంగా జనం వచ్చి వరండాలోను బయటా నిండిపోవటమేకాక ముందు ఖాళీ ప్రదేశం లోనూ నిలబడి వినేవారు.దాంతో తర్వాత్తర్వాత పరిషత్తు వెనుక ఓపెన్ వేదిక పై ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు.
          ఉపన్యాసాలు సరేకానీ వాలంటీర్లుగా ఆ సమావేశం ఆవరణంతా గలగలా సందడిగా ఉత్సాహం గా ఎగిరే సీతాకోక చిలుకల్లా తిరిగే యువతీయువకులను చూస్తుంటే నాకు నా కాలేజీ గుర్తువచ్చి గుబులుఅయ్యేది.వాళ్ళంతా కూడా సుమారుగా నా వయసు వాళ్ళు కావటం వలన వాళ్లలో నన్ను చూసుకుని మళ్ళా అలా తిరగ్గలనా అనిపించేది.చెవులు ఉపన్యాసం వింటున్నా ,నా చూపులు వారి వెనకెనకే తిరిగేవి.
           తర్వాత్తర్వాత ఆ యువభారతీయులైన 
సుధామ,నాగినేని భాస్కర్రావు,కె.బి.లక్ష్మి, కామేశ్వరరావు,రత్నమాల మొదలైన వారంతా మాకు కుటుంబమిత్రులు అయ్యారు.
     యువభారతి ప్రచురణలు వందకి పైగానే ముఖచిత్రాలు వీర్రాజే వేసారు.నా పరిచయం, వివాహం తర్వాత  వీర్రాజుగారు రాసిన తొలి దీర్ఘ కావ్యం” మళ్ళీవెలుగు “ యువభారతి ప్రచురణే.నాకు అంకితం ఇచ్చిన ఈ పుస్తకావిష్కరణ సభ కి 1973 లో మూడునెలల పసిపాప పల్లవిని తీసుకొని హాజరయ్యాను.మాకు యువభారతి సంస్థతో చిరకాల అనుబంధం కొనసాగుతూనే ఉంది.
          రాజధాని నగరం కావటాన ఆఫీసు పనులమీదో,చుట్టపు చూపుగానో,స్నేహంగానో,మరే అవసరార్ధం వలనో  మాయింటికి వచ్చే పోయే అతిథులు చాలా ఎక్కువ.వీళ్ళుకాక ముఖచిత్రాలు కోసం వచ్చేకూడా వేసారు.
      నాకు చాలా సంతోషం కలిగించేదీ ఎదురుచూసేది ఆదివారం సాయంత్రం.ఎందుకంటే ఆదివారం రోజు ఆంధ్ర సారస్వత పరిషత్తులో యువభారతి నిర్వహించే కావ్యలహరి ఉపన్యాస పరంపర ఉంటుంది.దానికి మాత్రం ఇంట్లో వాళ్ళనందరిని బయల్దేరదీయరు.అయితే మేమిద్దరమే వెళ్ళేదీ తక్కువే.ఎందుకంటే సెలవురోజు కనుక మధ్యాహ్నమే సాహితీ మిత్రులు వచ్చి ఉండేవారు.ఎప్పుడూ సాహిత్యసభలకు వెళ్ళలేదేమో కావ్యలహరి పేరిట మనుచరిత్ర ,పారిజాతాపహరణము ,వసుచరిత్రము ,విజయవిలాస కావ్యాలపై ఉపన్యాస పరంపరగా ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారి తో ఉపన్యాసాలను  యువభారతి సారథులు ఇరివెంటి కృష్ణమూర్తి గారు,వంగపల్లి విశ్వనాధం గారూ నిర్వహించేవారు. 
       ప్రాచీన సాహిత్యం మీదే ఉపన్యాసాలు ఉన్నా గంభీరస్వరంతో ఆయన పద్యాలు చదువుతూ వివరించటం అద్భుతంగా అనిపించేది.మొదట్లో పరిషత్తు హాలులోనే జరిగేవి. కానీ సభకు అశేషంగా జనం వచ్చి వరండాలోను బయటా నిండిపోవటమేకాక ముందు ఖాళీ ప్రదేశం లోనూ నిలబడి వినేవారు.దాంతో తర్వాత్తర్వాత పరిషత్తు వెనుక ఓపెన్ వేదిక పై ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు.
          ఉపన్యాసాలు సరేకానీ వాలంటీర్లుగా ఆ సమావేశం ఆవరణంతా గలగలా సందడిగా ఉత్సాహం గా ఎగిరే సీతాకోక చిలుకల్లా తిరిగే యువతీయువకులను చూస్తుంటే నాకు నా కాలేజీ గుర్తువచ్చి గుబులుఅయ్యేది.వాళ్ళంతా కూడా సుమారుగా నా వయసు వాళ్ళు కావటం వలన వాళ్లలో నన్ను చూసుకుని మళ్ళా అలా తిరగ్గలనా అనిపించేది.చెవులు ఉపన్యాసం వింటున్నా ,నా చూపులు వారి వెనకెనకే తిరిగేవి.
           తర్వాత్తర్వాత ఆ యువభారతీయులైన 
సుధామ,నాగినేని భాస్కర్రావు,కె.బి.లక్ష్మి, కామేశ్వరరావు,రత్నమాల మొదలైన వారంతా మాకు కుటుంబమిత్రులు అయ్యారు.
     యువభారతి ప్రచురణలు వందకి పైగానే ముఖచిత్రాలు వీర్రాజే వేసారు.నా పరిచయం, వివాహం తర్వాత  వీర్రాజుగారు రాసిన తొలి దీర్ఘ కావ్యం” మళ్ళీవెలుగు “ యువభారతి ప్రచురణే.నాకు అంకితం ఇచ్చిన ఈ పుస్తకావిష్కరణ సభ కి 1973 లో మూడునెలల పసిపాప పల్లవిని తీసుకొని హాజరయ్యాను.మాకు యువభారతి సంస్థతో చిరకాల అనుబంధం కొనసాగుతూనే ఉంది.
          రాజధాని నగరం కావటాన ఆఫీసు పనులమీదో,చుట్టపు చూపుగానో,స్నేహంగానో,మరే అవసరార్ధం వలనో  మాయింటికి వచ్చే పోయే అతిథులు చాలా ఎక్కువ.వీళ్ళుకాక ముఖచిత్రాలు కోసం వచ్చేవాళ్ళు సరేసరి.ఇంట్లో అందరికీ బంధుప్రీతి, అతిథి మర్యాదలు ఎక్కువే.అందువలన రోజంతా టీ పొయ్యి మీద మరుగుతూనే ఉండేది. రాత్రి అయినా సరే ఎవరైనా వస్తే మా పెద్దమరిది  అప్పు చేసైనా చికెన్ కొనుక్కొచ్చేసేవాడు.ఓపిక లేకపోయినా దేవుడా అనుకుని స్టౌ వెలిగించి కూర ,అన్నం చేయాల్సి వచ్చేది.ఒక్కొక్కప్పుడు ఓపిక లేకపోతే వచ్చిన వారికి ఉన్నది పెట్టేసి అడుగుబొడుగుతో కడుపు నింపు కోవటం కూడా జరిగేది.ఇటువంటివన్నీ ఇంట్లో ఉన్నవాళ్ళే ఆడవాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి కానీ ఏం చెప్పుకుంటాం.
       అందుకే 'నిన్ను గ్రాడ్యుయేట్ చేసే పూచీ నాదీ'అని వీర్రాజు అంటున్నా ఒకవేళ ఇక్కడే చదివేటట్లైతే నేను అక్షరం ముక్కైనా చదవగలనా అని బెంగ పెట్టుకున్నాను .
       అయితే వీర్రాజు మిత్రులు  అందరూ ఈ ఏడాది విజయనగరం లో చదివించటమే మంచిది అనటంవల్లకావచ్చు,నాస్నేహితురాలు ఉషా " కాలేజీలో పాఠాలు మొదలయ్యాయి.లెక్చరర్లు సుభద్ర చదువు మానేసిందా అని అడుగు తున్నారు.మరి ఏం నిర్ణయించుకున్నావు?"అంటూ ఉత్తరం రాయటం వల్ల కావచ్చు,.అన్నయ్య కూడా"సుభద్రను విజయనగరం లోనే చదివిస్తారా? కాలేజీలు మొదలైనాయి"అని రాయటం వలన కావచ్చు,నాకు ఇచ్చిన మాట వలన కావచ్చు  నాకు విజయనగరానికి రిజర్వేషన్ చేయించారు.
         చదువు మీద మోహంతో విజయనగరానికి బయల్దేరినా ఒంటరిగా రైలెక్కి ఫ్లాట్ ఫాం మీద దిగులు పరుచుకున్న ముఖంతో ఉన్న వీర్రాజును చూసి దుఃఖం పొంగుకు వచ్చింది.రైలు బయల్దేరటంవలనో చూపుకు అడ్డంగా ఉన్న కన్నీటి పొరవలనో ఆయన రూపం మసకబారింది.చదువు పూర్తి చేయాలనే నా కోరిక కన్నీటి పొరను తుడిచేసింది.వాళ్ళు సరేసరి.ఇంట్లో అందరికీ బంధుప్రీతి, అతిథి మర్యాదలు ఎక్కువే.అందువలన రోజంతా టీ పొయ్యి మీద మరుగుతూనే ఉండేది. రాత్రి అయినా సరే ఎవరైనా వస్తే మా పెద్దమరిది  అప్పు చేసైనా చికెన్ కొనుక్కొచ్చేసేవాడు.ఓపిక లేకపోయినా దేవుడా అనుకుని స్టౌ వెలిగించి కూర ,అన్నం చేయాల్సి వచ్చేది.ఒక్కొక్కప్పుడు ఓపిక లేకపోతే వచ్చిన వారికి ఉన్నది పెట్టేసి అడుగుబొడుగుతో కడుపు నింపు కోవటం కూడా జరిగేది.ఇటువంటివన్నీ ఇంట్లో ఉన్నవాళ్ళే ఆడవాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి కానీ ఏం చెప్పుకుంటాం.
       అందుకే 'నిన్ను గ్రాడ్యుయేట్ చేసే పూచీ నాదీ'అని వీర్రాజు అంటున్నా ఒకవేళ ఇక్కడే చదివేటట్లైతే నేను అక్షరం ముక్కైనా చదవగలనా అని బెంగ పెట్టుకున్నాను .
       అయితే వీర్రాజు మిత్రులు  అందరూ ఈ ఏడాది విజయనగరం లో చదివించటమే మంచిది అనటంవల్లకావచ్చు,నాస్నేహితురాలు ఉషా " కాలేజీలో పాఠాలు మొదలయ్యాయి.లెక్చరర్లు సుభద్ర చదువు మానేసిందా అని అడుగు తున్నారు.మరి ఏం నిర్ణయించుకున్నావు?"అంటూ ఉత్తరం రాయటం వల్ల కావచ్చు,.అన్నయ్య కూడా"సుభద్రను విజయనగరం లోనే చదివిస్తారా? కాలేజీలు మొదలైనాయి"అని రాయటం వలన కావచ్చు,నాకు ఇచ్చిన మాట వలన కావచ్చు  నాకు విజయనగరానికి రిజర్వేషన్ చేయించారు.
         చదువు మీద మోహంతో విజయనగరానికి బయల్దేరినా ఒంటరిగా రైలెక్కి ఫ్లాట్ ఫాం మీద దిగులు పరుచుకున్న ముఖంతో ఉన్న వీర్రాజును చూసి దుఃఖం పొంగుకు వచ్చింది.రైలు బయల్దేరటంవలనో చూపుకు అడ్డంగా ఉన్న కన్నీటి పొరవలనో ఆయన రూపం మసకబారింది.చదువు పూర్తి చేయాలనే నా కోరిక కన్నీటి పొరను తుడిచేసింది.

నడక దారిలో -18

 నడక దారిలో –18

  1971లో ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ నుండి వెళ్ళిపోవాలని డిమాండ్ వలన NGO బందు మొదలైందనీ,అది చాలా తీవ్రంగా జరుగుతుండటం వలన ఎప్పటి వరకూ సాగుతుందో తెలియదనీ,పరీక్షలు అయిపోయినట్లైతే వస్తాననీ, వివాహం తర్వాత వచ్చిన తన తొలి పుట్టినరోజు కలిసి జరుపుకోవాలని ఉందని రాసారు వీర్రాజు. అలాగే పరీక్షలు పూర్తి అయ్యాయని తెలిసి రెక్కలు కట్టుకునిి విజయనగరం ఏప్రిల్ 21 సాయంత్రానికి వచ్చేసారు.

       అనుకోకుండా ప్రాక్టికల్ పరీక్షలు పోష్ట్ ఫోన్ కావటంతో శ్రీకాకుళం లో పనిచేస్తున్న బాల్యమిత్రుడి దగ్గరకు వెళ్దామని బయల్దేరదీసారు.చిన్నన్నయ్యకి ఎలక్షన్ డ్యూటీ పడింది.మేమిద్దరమే వెళ్ళాము.ఆరాత్రి ఆ మిత్రుడు వెళ్ళనివ్వక వెళ్లకపోవడం తో రాత్రికి ఆగి ఉదయం విజయనగరం వచ్చేసాము. 

      ఆ వెంటనే మా పెద్ద ఆడబడుచు వాళ్ళు ఉన్న భువనేశ్వర్ కి వెళ్ళాము.ఎండలకో ఎక్కడో భోజనం పడకపోవటం వలనో వీర్రాజు కి కొద్దిగా అనారోగ్యం కలిగే సరికి తల్లడిల్లి పోయాను.ఆ రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోగానే కోలుకున్నారు.

         భువనేశ్వర్ లో 8-12 శతాబ్దాలమధ్య నిర్మించబడి అద్భుతమైన శిల్పాలతో అలరారే ఆలయాలు ఉండటంవలన దాన్ని టెంపుల్ సిటీ అని కూడా అంటారుట .ఆ ప్రాంతంలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ్ ఆలయం, లింగరాజు టెంపుల్,రాజారాణీ టెంపుల్, ఖండగిరీ,దేవగిరీ గుహలూ, ధవళగిరి మొదలైన విహార ప్రదేశాలన్నీ చెట్టాపట్టాలేసుకుని ప్రేమ పక్షుల్లా విహరించాం.శిల్పాల స్కెచ్ వేస్తుండగా ఒక బెంగాలీ బాబు చూసి heavens gift అని వీర్రాజును పొగిడేసరికి ఏకాగ్రతతో వేస్తున్న ఆయన్ని చూసి నేను పొంగిపోయాను. ఏ శిల్పం చాటునో నా చెంపలపై కూడా చటుక్కున కొత్త స్కెచ్ వచ్చి చేరేది.

    కొత్త దంపతులకు గిలిగింతలు పెట్టే కోణార్క్ శిల్ప సౌందర్యం చూస్తుంటే తాపీ ధర్మారావు గారు రాసిన “దేవాలయాలలో బూతు బొమ్మలు ఎందుకు?” అనే పుస్తకం గుర్తు వచ్చింది. విజయనగరానికి దగ్గర్లో ఉన్న విశాఖలో సముద్రాన్ని కూడా అంతవరకూ చూడనేలేదేమో పూరీలో అనంతజలరాశిని చూసి అబ్బుర పడ్డాను.పాలనురుగుల అలలు సముద్రగర్భంనుండి తీసుకు వచ్చిన గవ్వల్ని, నున్నని రాళ్ళని ఆత్మీయంగా అందుకుని మురిసిపోయాను.ధవళగిరి స్తూపం చుట్టూ బుధ్ధుని కథలోని ముఖ్యఘట్టాలని చూసి ధ్యానాంతరంగంతో మౌనిని అయ్యాను. వారంరోజులపాటూ తిరిగి తిరిగి ఆనందాలనూ,పరిమళభరిత అనుభవాలూ మూటగట్టుకుని విజయనగరం వచ్చేసాము.

       వచ్చిన నాలుగు రోజుల తర్వాత ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేసుకుని హైదరాబాద్ కి ఇద్దరం బయల్దేరాం.అమ్మ తీపి ఆవకాయ, మిఠాయిలు తయారు చేసి ఇచ్చింది.నేను పత్రికల్లో కట్ చేసి కుట్టించిన రంగనాయకమ్మ,ద్వివేదుల విశాలాక్షి లాంటి రచయిత్రుల సీరియల్సే కాక, మాలతీ చందూర్ రాసిన వంటలూ పిండివంటలు పుస్తకం కొనుక్కొని తీసుకు వెళ్ళటానికి సర్దుకున్నాను.

          అప్పట్లో హౌరా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం విజయనగరం నుంచి హైదరాబాద్ కు ఇరవై నాలుగు గంటలు పట్టేది.హైదరాబాద్ లో సాయంత్రం ఎక్కుతే విజయనగరంకి మర్నాడు సాయంత్రం చేరుతుంది.. విజయనగరంలో ఉదయం ఎక్కితే హైదరాబాద్ కి మర్నాడు ఉదయంచేరుతుంది.స్టేషన్ కు కుమారీ,తన చెల్లెలూ వచ్చారు.నేను వెళ్ళిపోతున్నానని వాళ్లు ఏడుస్తుంటే నాకు కూడా నా వాళ్ళందర్నీ విడిచివెళ్తున్నందుకు దుఃఖం ముంచుకొచ్చింది.ఇది ప్రతీ ఆడపిల్ల కూ అనుభవైకవేద్యమే కదా  

       ఇద్దరమే ఇరవైనాలుగు గంటలపాటూ చేసిన ప్రయాణం కూడా ఒక కొత్త అనుభవమే.

      మేము ఇల్లు చేరేసరికి వీర్రాజు గారి బాల్యమిత్రుడు, భార్య,రెండేళ్ళకొడుకుతో ఢిల్లీ నుండి వచ్చిఉన్నారు. హైమ నావయసుదే కావటాన నాకు కుమారీతో ఉన్న స్నేహం లాగే ఆమెతో కంఫర్టుగా అనిపించింది.ఆ కుటుంబం తో హైదరాబాద్ లోని విహార ప్రదేశాలు మళ్ళా తిరిగాము.

     హైదరాబాద్ రామకోటిలో ఉన్న మా ఇంట్లో పేద్ద వంటగది.దానికి మూడింతలు పెద్దదైన మరోగది ఉంటుంది .ఆ పెద్దగా ఉన్నగదిని శిల్పాలచిత్రాలు ఉన్న పెద్దకర్టెన్ తో పార్టిషన్ చేసారు.ఆ పార్టిషన్ కి ఒకవైపు ఒకపుస్తకాలషేల్ప్, వీర్రాజు గారు చిత్రాలు వేసుకోవడానికి వీలుగా టేబుల్, కుర్చీఉంటుంది, టేబుల్ మీద వాజ్ లో రకరకాల బ్రెష్ లు,కలాలు, టేబుల్ మీద రంగులూ ఉంటాయి.మరోపక్క ఇటీవలే కొన్న వైర్ అల్లిక సోఫా సెట్ ఉంటుంది.

     పార్టిషన్ రెండో భాగం లో కొత్తగా కొన్న డబుల్ కాట్ పైన ఓపక్క వీణ పెట్టగా మిగిలిన స్థలంలో చిన్న ఆడబడుచు పడుకుంటుంది.ఇద్దరు మరుదులు, బేంక్ లో పనిచేస్తూన్న బంధువుల అబ్బాయి కింద బొంతలు వేసుకు పడుకునే వారు.మా ఆడబడుచు నా వయసుదే కానీ మిగతావాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు కావటాన, కొత్తదనం వల్ల చనువుగా మాట్లాడటం తిరగటం చేయ లేకపోయేదాన్ని.

   వీర్రాజు గారు ఒక్కోసారి సినిమాకో హొటల్ కో వెళ్దామంటూ ప్రోగ్రాం వేసి ఇంట్లో వాళ్ళందరినీ బయల్దేరదీసేవారు.వాళ్ళైనా "మీరిద్దరూ వెళ్ళండి" అని అనేవారు కాదు.అన్నగారితో మాట్లాడటం తక్కువ.ఎదురు మాట్లాడటమూ తక్కువే.ఆ రోజుల్లో కుటుంబం లో మొదటి సంతానం కి సుప్రీం పవర్లు ఉండేవనుకుంటాను.ఇక అందరం సంతాపసభకి వెళ్ళినట్లు ఒకరితో ఒకరం మాట్లాడకుండా నిశ్శబ్దంగా సినీమా చూసుకొనో, బుధ్ధిగా హొటల్లో తినో ఇంటికి వచ్చేసే వాళ్ళం. దాంతో నాకు ఆయనతో సినిమా చూడాలనే ఆసక్తి , ఉత్సాహం ఎగిరిపోయింది.అందుచేత మేమిద్దరమే వెళ్ళి చూసిన సినిమాలే లేవు.

అటువంటప్పుడు చాలా కోపం వచ్చేది.హొటల్ లో సర్వర్ లా ఆర్డర్ ఇస్తే తెచ్చినట్లుగానో అవమానంచేసినట్లుగానో బాధ పడేదాన్ని.ఆ తర్వాత ఆయనతో తగువు పెట్టుకోవాలనుకున్నాను.పెళ్ళయిన కొత్తలోనే మా మధ్య తగువు రావటం ఇష్టం లేక బయటపడలేకా మనసు కలచి వేసింది.తర్వాత్తర్వాత నా అభ్యంతరాన్ని అర్థం చేసుకుని పిలిచి చెప్పటమో,లోపలకి వచ్చి చెప్పటమో అలవాటైంది.

          ఆ మధ్య వీర్రాజు గారి రచనలమీద వచ్చిన వ్యాసాల్ని సంకలనం చేసినప్పుడు కొందరు ఆత్మీయ కవుల్ని కూడా వ్యాసం రాసి ఇమ్మని కోరితే సాహిత్యం మీద కాకుండా స్నేహం మీదే రాసీ నాచేతి టీ చాలాసార్లు తాగిన విషయాన్ని కూడా ఉటంకించటం విశేషం.

          వచ్చినవాళ్ళు వెళ్ళేసరికి తొమ్మిదో పదో అయ్యేది.ఇక అప్పుడు చప్పగా చల్లారిపోయిన వంటకాల్ని ఇద్దరం భోంచేసేవాళ్ళం.

ఆతర్వాత అందరూ నిద్రపోయేవరకూ మళ్ళా ఆయన చిత్రాలు వేసుకుంటూ కూర్చునేవారు. నేను పంపు స్టౌ మీద వండే అలవాటు లేని వంటపనీ, ఇంటిపనులు చేసి అలసటకు కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా నిద్రని తోలుకుంటూ రెప్పలు ఎత్తిపట్టుకుని సోఫాలో ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూర్చునే దాన్ని.ఒక్కొక్కప్పుడు అదేసమయంలో బాపూ బొమ్మలు చూసి వేస్తూఉండేదాన్ని‌.

    పెళ్ళి అయ్యాక వచ్చినప్పుడు స్వాతి ఆఫీసు లో మా పడక ఉండేది.వీర్రాజుగారు ప్రభుత్వఉద్యోగి కనుక పత్రిక సంపాదకుడిగా పేరు ఉండరాదని అభ్యంతరం రావటంతో స్వాతి నుండి బయటకు వచ్చేసారు. అందువలన స్వాతి ఆఫీసు తాళం అడగటం బాగోదు కదా.అదీగాక ఇక్కడ ఖాళీ చేసి స్వాతి ఆఫీసును విజయవాడ కి మార్చేందుకు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు.       

       అందుకని అందరూ నిద్రపోయేవరకూ గడిపి అప్పుడు నవారు మంచాన్ని వంటింట్లోకి తీసుకువెళ్ళి వాల్చి పక్క సర్దుకుని దానిమీద వాలేసరికి ముందుగా నిద్రే శరీరాన్ని ఆక్రమించేది.నిద్ర తీరకుండానే తెల్లవారుజాము నాలుగు గంటలు అయ్యేసరికి మంచినీళ్ళు వస్తున్నాయనే సూచనగా గొట్టంలోని గాలివల్ల కొళాయి ఈల వేసేసరికి ఒక్క గెంతుతో మంచం దిగి నేను ముఖం కడుక్కుని మంచినీళ్ళను పట్టేందుకు, ఆయన బొమ్మలు వేసుకునేందుకు పరుగు పెట్టేవాళ్ళం.

     అప్పట్లోనే బసు చటర్జీ తీసిన జయాబాధురీ నటించిన " పియా కా ఘర్" సినిమా విడుదల అయితే ఇంట్లో అందరం కలిసే చూసాం. ఆ డైరెక్టర్ మా ఇంట్లో మా సంసారాన్ని తొంగిచూసే ఆ సినిమా తీసాడేమో అనిపించింది.

            పేజీలకు పేజీలు ఉత్తరాల్లో ఒలికించిన కబుర్లన్నీ పావురాలే ఎగరేసుకు పోయాయా? మొగమాటాలతో,భయాలతో మేము మాటలను కలబోసుకోకుండానే, మనసులను పంచుకోకుండానే మా దాంపత్యం ఇలానే దేహభాషతో మాత్రమే కలకాలం నడుస్తుందా? ఈ వ్యక్తి నా మనసులోకి రాకుండా బయటే నిలబడిపోతారా? నాలో ఏమూలో ‌ఒకసంశయం,ఒక అసంతృప్తి మొలకెత్తింది.దానిని వృక్షంగా ఎదగకుండా అభిమానంతో కత్తిరించేసాను.    

    మే30 నుండి ప్రారంభమైన అఖిలభారత రచయితల సభలు కొంత ఊరట కలిగించాయి‌ ఆ సభల్లోనే వాసిరెడ్డి సీతాదేవి,ఆనందారామం,డి.కామేశ్వరీ ,రామలక్ష్మీ మొదలైన రచయిత్రులను పరిచయం చేసారు.ఆ తర్వాత్తర్వాత వారితోనే వేదికలు పంచుకునేలా నేను రచయిత్రి గా ఎదిగాను.

            అప్పుడప్పుడు ఇంటిమీద,అమ్మ మీద దిగులు అనిపించేది.వేెసవిలో నా పొడుగాటి జడకి చుట్టూ మాలచుట్టుకునేటన్ని పూలను ఇచ్చే సన్నజాజి పందిరి ఎంత చిన్నబోయిందో అని తలంచుకొనే దాన్ని.

         రాజధాని నగరంలో కిటికీలోంచి తొంగిచూసే అవకాశం లేక చందమామ నాకోసం అక్కడ డాబా మీద వెతుక్కొని నేను కనిపించక పోవటం తో కురిసే వెన్నెల్ని పొదువుకొని మేఘాలదుప్పట్లో ముఖం దాచుకున్నాడేమో.నేను పాడుకునే లలిత గీతాలు గొంతులో కొట్టుకు లాడేవి.

      హైదరాబాద్ వచ్చి నెల కావస్తుంది.నా చదువు సంగతి ఏమీ తెలియటం లేదు.కాలేజీలు తెరిచారోలేదో నా స్నేహితురాలు కూడా ఉత్తరం రాయలేదు.నేనైనా ఉత్తరం రాయాలి.

     వీర్రాజు ఉదయమే లేచి స్నాన పానాదులు చేసి ఆఫీస్ కి బందు కనుక వేయాల్సిన ముఖచిత్రాలకు బొమ్మలు వేసుకుంటూకూర్చునేవారు. అంతలో మిత్రులు వస్తేనో, స్వాతి పత్రిక పని ఉంటే బయటకు వెళ్ళేవారు.తిరిగి వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఒకరో ఇద్దరో సాహితీ మిత్రులు ముఖచిత్రాలు వేయించుకునేందుకు కలిసి వచ్చేవారు.వాళ్ళు పని పూర్తి చేసుకుని వెళ్ళేలోపల ఓ రెండు సార్లయినా టీ ఇవ్వమని గోడకో లేకపోతే అటువైపు వచ్చిన మరుదులకో చెప్పేవారు.ప్రేమపూర్వకంగా దేవీ అనో లేదా సుభా అనో పిలవకపోయినా సుభద్రా అని పిలవడానికి కూడా అందరి ముందు ఆయనకి మొగమాటమే.నేను టీ తీసుకొని ఇవ్వటానికి వెళ్తే వచ్చిన వాళ్ళని నాకు పరిచయంచేయటం గానీ లేదా నాకు

వాళ్ళని పరిచయం చేయటం గానీ చేసేవారు కాదు.
అటువంటప్పుడు చాలా కోపం వచ్చేది.హొటల్ లో సర్వర్ లా ఆర్డర్ ఇస్తే తెచ్చినట్లుగానో అవమానంచేసినట్లుగానో బాధ పడేదాన్ని.ఆ తర్వాత ఆయనతో తగువు పెట్టుకోవాలనుకున్నాను.పెళ్ళయిన కొత్తలోనే మా మధ్య తగువు రావటం ఇష్టం లేక బయటపడలేకా మనసు కలచి వేసింది.తర్వాత్తర్వాత నా అభ్యంతరాన్ని అర్థం చేసుకుని పిలిచి చెప్పటమో,లోపలకి వచ్చి చెప్పటమో అలవాటైంది.
          ఆ మధ్య వీర్రాజు గారి రచనలమీద వచ్చిన వ్యాసాల్ని సంకలనం చేసినప్పుడు కొందరు ఆత్మీయ కవుల్ని కూడా వ్యాసం రాసి ఇమ్మని కోరితే సాహిత్యం మీద కాకుండా స్నేహం మీదే రాసీ నాచేతి టీ చాలాసార్లు తాగిన విషయాన్ని కూడా ఉటంకించటం విశేషం.
          వచ్చినవాళ్ళు వెళ్ళేసరికి తొమ్మిదో పదో అయ్యేది.ఇక అప్పుడు చప్పగా చల్లారిపోయిన వంటకాల్ని ఇద్దరం భోంచేసేవాళ్ళం.
ఆతర్వాత అందరూ నిద్రపోయేవరకూ మళ్ళా ఆయన చిత్రాలు వేసుకుంటూ కూర్చునేవారు. నేను పంపు స్టౌ మీద వండే అలవాటు లేని వంటపనీ, ఇంటిపనులు చేసి అలసటకు కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా నిద్రని తోలుకుంటూ రెప్పలు ఎత్తిపట్టుకుని సోఫాలో ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూర్చునే దాన్ని.ఒక్కొక్కప్పుడు అదేసమయంలో బాపూ బొమ్మలు చూసి వేస్తూఉండేదాన్ని‌.
    పెళ్ళి అయ్యాక వచ్చినప్పుడు స్వాతి ఆఫీసు లో మా పడక ఉండేది.వీర్రాజుగారు ప్రభుత్వఉద్యోగి కనుక పత్రిక సంపాదకుడిగా పేరు ఉండరాదని అభ్యంతరం రావటంతో స్వాతి నుండి బయటకు వచ్చేసారు. అందువలన స్వాతి ఆఫీసు తాళం అడగటం బాగోదు కదా.అదీగాక ఇక్కడ ఖాళీ చేసి స్వాతి ఆఫీసును విజయవాడ కి మార్చేందుకు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు.       
       అందుకని అందరూ నిద్రపోయేవరకూ గడిపి అప్పుడు నవారు మంచాన్ని వంటింట్లోకి తీసుకువెళ్ళి వాల్చి పక్క సర్దుకుని దానిమీద వాలేసరికి ముందుగా నిద్రే శరీరాన్ని ఆక్రమించేది.నిద్ర తీరకుండానే తెల్లవారుజాము నాలుగు గంటలు అయ్యేసరికి  మంచినీళ్ళు వస్తున్నాయనే సూచనగా  గొట్టంలోని గాలివల్ల కొళాయి  ఈల వేసేసరికి ఒక్క గెంతుతో మంచం దిగి నేను ముఖం కడుక్కుని మంచినీళ్ళను పట్టేందుకు, ఆయన బొమ్మలు వేసుకునేందుకు పరుగు పెట్టేవాళ్ళం.
     అప్పట్లోనే బసు చటర్జీ తీసిన జయాబాధురీ నటించిన   " పియా కా ఘర్" సినిమా విడుదల అయితే ఇంట్లో అందరం కలిసే చూసాం. ఆ డైరెక్టర్ మా ఇంట్లో మా సంసారాన్ని తొంగిచూసే ఆ సినిమా తీసాడేమో అనిపించింది.
            పేజీలకు పేజీలు ఉత్తరాల్లో ఒలికించిన కబుర్లన్నీ  పావురాలే ఎగరేసుకు పోయాయా? మొగమాటాలతో,భయాలతో మేము మాటలను కలబోసుకోకుండానే, మనసులను పంచుకోకుండానే మా దాంపత్యం ఇలానే   దేహభాషతో మాత్రమే కలకాలం  నడుస్తుందా? ఈ వ్యక్తి నా మనసులోకి రాకుండా బయటే నిలబడిపోతారా? నాలో ఏమూలో ‌ఒకసంశయం,ఒక అసంతృప్తి మొలకెత్తింది.దానిని వృక్షంగా ఎదగకుండా  అభిమానంతో కత్తిరించేసాను.    
    మే30 నుండి ప్రారంభమైన అఖిలభారత రచయితల సభలు కొంత ఊరట కలిగించాయి‌ ఆ సభల్లోనే    వాసిరెడ్డి సీతాదేవి,ఆనందారామం,డి.కామేశ్వరీ  ,రామలక్ష్మీ మొదలైన రచయిత్రులను పరిచయం చేసారు.ఆ తర్వాత్తర్వాత వారితోనే వేదికలు పంచుకునేలా నేను రచయిత్రి గా ఎదిగాను.
            అప్పుడప్పుడు ఇంటిమీద,అమ్మ మీద దిగులు అనిపించేది.వేెసవిలో నా పొడుగాటి జడకి చుట్టూ మాలచుట్టుకునేటన్ని పూలను ఇచ్చే సన్నజాజి పందిరి ఎంత చిన్నబోయిందో అని తలంచుకొనే దాన్ని.

         రాజధాని నగరంలో కిటికీలోంచి  తొంగిచూసే అవకాశం లేక చందమామ నాకోసం అక్కడ   డాబా మీద వెతుక్కొని నేను కనిపించక పోవటం తో  కురిసే వెన్నెల్ని పొదువుకొని మేఘాలదుప్పట్లో ముఖం దాచుకున్నాడేమో.నేను  పాడుకునే లలిత గీతాలు గొంతులో కొట్టుకు లాడేవి.

      హైదరాబాద్ వచ్చి నెల కావస్తుంది.నా చదువు సంగతి ఏమీ తెలియటం లేదు.కాలేజీలు తెరిచారోలేదో నా స్నేహితురాలు కూడా ఉత్తరం రాయలేదు.నేనైనా ఉత్తరం రాయాలి.