1, సెప్టెంబర్ 2024, ఆదివారం

లక్ష్యశుద్దిగల కథకుడు- కె.కె.మీనన్

లక్ష్యశుద్ధి, నిజాయితీ గల కథకుడు సాహిత్య రంగంలో కేవలం కృషి మాత్రమే కాకుండా హెూదా, కులం, మతం, వర్గం, చొచ్చుకుపోయే స్వభావం, శిష్య-ప్రతి శిష్యుల బలగం వంటివి రచయిత అంచలంచెలుగా ఎదిగిపోవడానికి సహాయ పడతాయని కొందరిని చూస్తుంటే అనిపిస్తుంది. మరి కొందరు కేవలం నిబద్ధతతో, గుర్తింపు కోసం ఆశించకుండా, తమను కలవరపెట్టిన దృశ్యాలకు సాహిత్య రూపం ఇచ్చే వరకు తమను వెంటాడిన సంక్షోభ సంఘటనలు, వాటి పరిష్కారాలను, సమర్థవంతమైన శైలీ విన్యాసంతో, రచనా రూపంగా అల్లుకుంటూ ఉండిపోతారు. ఒక్కొక్కప్పుడు అటువంటి వారు, తమ సమకాలీనులలో గుర్తింపు పొందినా, పొందక పోయినా, ఎప్పుడో ఒకప్పుడు తాము అందించిన సాహిత్యం ద్వారానే గుర్తింపుకు నోచుకుంటారు. అటువంటి కథా రచయితలలో స్వర్గీయ మీనన్ ఒకరు. కె.కె.మీనన్ అనగానే ఈయన ఎవరో మలయాళీ అని చాలా మంది అనుకునే ప్రమాదం వుంది. కానీ, ఆయన స్వచ్ఛమైన తెలుగువాడు. 'కృష్ణమూర్తి' జన్మ నామంతో మొదలై కె రూపాంతరం చెందిన వాడు ఆయన హైదరాబాద్ లోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉన్నతోద్యోగంలో ఉంటూ 'రంజని' అనే సాహిత్య సంస్థకు అధ్యక్షుడిగా ఎంతో మందికి పలు సాహిత్య సమావేశాలలో అవకాశం కల్పిస్తూ అనేక మంచి సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారాయన. అదే సమయంలో అంటే 1973 నుండి 1998 వరకూ అనేక కథలు రాశాడు. కానీ ఆయన రాసిన కథలన్నీ పుస్తక రూపం లోనికి రాలేదు. కొన్ని ఎంపిక చేసిన కథలతో మాత్రమే కేవలం 'ఇది స్ట్రీకింగ్ కాదు', 'పులికూడు' అనే రెండు కథా సంపుటాలు మాత్రమే వెలువరించారు. అనువాద కథలకు సంబంధించి అవి పుస్తక రూపం చూడకుండానే కాలగర్భంలో కలిసి పోయాయి. ఇవి కాక మీనన్ గారు. " ప్రభువు" అనే నవలలు కూడా ప్రచురించారు. ఇందులో 'బాకీ బతుకులు' నవల 'స్వాతి' మాసపత్రిక అనుబంధ నవలగా ఇప్పటి విశాలాంధ్ర ప్రచురణాలయం వారు పుస్తకంగా ముద్రించారు. క్రతువు నవల మాత్రం ఆంధ్రప్రభ వారపత్రికలో అప్పటి సంపాదకులు వాకాటి పాండురంగారావు గారి సంపాదకత్వంలో సీరియల్ గా ప్రచురితమైంది. ఈ నవలను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో శ్రీ జీడిగుంట రామ చంద్రమూర్తి నాటకీకరణం చేయగా, సీరియల్ నాటకంగా ప్రసారం అయ్యింది. నవల మాత్రం భాషలోకి అనువదించండి. ప్రముఖాల ప్రతులు మీనన్ గారు తన మూలాలను మాత్రం మరచిపోలేదు. పుట్టి పెరిగిన కోన గ్రామీణ (నిండి-రామరాజులంక) వాతావరణం అక్కడి గ్రామాలలో బడుగు బలహీనవర్గాలపై ధనాధిపతులు, భూకామందులు జరిపే రాష్టీకం, అక్కడ నెలకొని వున్న ఆర్థిక అసమానతలే కాక, కుల వివక్షకు బలి అయ్యే ఆర్థికజీవన విధ్వంసాలు, రచయితను వెంటాడుతుండడం వల్ల మీనన్ కథలలో అవన్నీ దృశ్యమానమయ్యాయి, మహా నగర జీవితంలో స్థిరపడినా బాల్యం నుండి హృదయంపై ముద్ర పడిన దృశ్యాలు, రచయితగా మీనన్ గారిని స్థిరంగా ఉండనీయ లేదు. అయనను వెంటాడిన దృశ్యాల నుండి పారిపోకుండా, వాటిని అక్షరాలలో పొదిగి వాస్తవాంశాలను కథలుగా మార్చే క్రమంలో సాహిత్య విలువలకు ఏమాత్రం భంగం కలగకుండా సాధ్యమైనంతవరకు గ్రామీణ విధ్వంసాల నేపథ్యం పాఠకుడి గుండెల్ని తట్టేలా చేశాడు రచయిత. అందుకుగాను ఆయన కధనశైలి ఎంతగానో తోడ్పడింది. గ్రామీణ జీవనం పట్ల, సమస్యలపట్ల, ఖచ్చితమైన అవగాహన రచయితకు వుంది. అందుకే లక్ష్యశుద్దితో తాను పాఠకుడికి చెప్పడమే గాక, తన పాఠకుడికి, గాఢానుభూతిని కలిగించి మమేకమయ్యే విధంగా, కళారూపాన్నీ శిల్పించగల నేర్పు రచయిత మీసన్ గారిలో వుంది. గ్రామాలలో గ్రామాధికారులు-రైతుకూలీల పట్లా, కడ జాతులవారు పట్లా ప్రదర్శించే అలసత్వం వృరూపుతూ మర్కోక్క పేద- బడుగు వర్గాలు, తమ కలల్ని సాకారం చేసుకునేందుకు స్వంత, జీవితాల్ని సైతం, త్యాగం చేసి, వెట్టిచాకిరి చేస్తున్నా, కనికరించని గ్రామపెద్దల దౌర్జన్యాన్ని బలంగా తన రచనలలో చెప్పాడు రచయిత. బాల్యంనుండీ అణిగి మణిగి మౌనంగా వున్నా ఇలాకూడా బతకనీయని, దుర్భర పరిస్థితుల్ని సాధికారంగా వివరించాడు. రచయిత. ఉద్యోగరీత్యా భాగ్యనగరం లో (హైదరాబాద్) స్థిరపడినప్పటికీ అందుకే ఈ రచయితకు జీవితంపట్ల, సమాజం పట్టా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. తన అభిప్రాయాల్ని వెల్లడించడంలో ఈ రచయిత, ధనుగునూ, పులుముడూ దరిచేరనీయడు, దోపిడీ వ్యవస్థను, బట్టబయలు చేసేందుకు, ఒక లక్ష్యశుద్ధితో రాస్తున్నారు" అని కాళీపట్నం రామారావు మాస్టారు ప్రశంసించారు మీనన్ గారిని. మీనన్ కథలు సంభాషణాత్మకంగా ఉండడం వల్లనూ, క్లుప్తంగా రాయడంవల్లనూ, కథాంశాన్ని చెప్పదలచుకున్న విషయాన్నీ, సాగతీత లేకుండా, సుస్పష్టంగా చెప్పే ధోరణి వల్ల పాఠకుడికి, తేలికగా అర్ధం అవుతూనే సాంద్రత కలిగి ఉండడం వీరి కథల ప్రత్యేకత. అందుకే కథ చదివిన పాఠకుడు కూడా గొప్ప అనుభూతిని చెందడమే కాదు. స్పందిస్తారు కూడా!.. కథను చాలావరకు సంభాషణలతోనే, నడపడంవలన పాత్రల ముఖతా చెప్పేచోట, ఆయా సంభాషణలే పాత్రల స్వరూప స్వభావాల్ని తమలోని సంఘర్షణల్ని వ్యక్తపరుస్తాయి. తిరుగుబాటు ధోరణిని, సూటిగా, పదునైన పదాలతో, పాత్రోచితమైన మాండలీకంలో ప్రకటిస్తాయి. అంతమాత్రమేగాక, కథని నాటకీకరణ చేయాలనుకునేవారికి, చాలా సులభతరంగా కూడా ఉంటాయి మీనన్ కథలు, మీనన్ గారి కథల్లో విశదంగా, విస్తారంగా వున్న పెద్దకత- పులికూడు. ఆయన కథలు అన్నీ ఇంచుమించు పదిపేజీలకు మించనివి. కానీ ఈకథ-పదిహేనుపేజీలు వుంది. కథాంశాన్ని బట్టి తప్పనిసరిగా పెద్దదిగా చేయాల్సిన కధ ఇది. ప్రపంచీకరణ వల్ల వచ్చిన జీవనవిధానం లోని మార్పులు, మానవస్వభావాలు, మారిపోతున్న సంబంధాలు కథలో అంతర ప్రవాహాలుగా ఉంటాయి. ఒ.ఎన్.జి.సి. వలన కోనసీమ తీరప్రాంతాలలో వచ్చిన నగరీకరణ ఈ కథలో ప్రధాన వివరణగా ఉంటుంది. గోదావరి నది దాటేందుకు, ఉపయోగించే ఫంటు, ఇప్పుడు సరంగు నడపనవసరము లేకుండా, ఇంజను సహాయంతో, నడపటం నాయకుడిని ఆశ్చర్యపరుస్తుంది. సరంగు ఇంజను స్టార్ట్ చేసి, హాయిగా కూర్చోడం చూసి, సాంకేతిక ప్రగతి మనిషిని ఎంత సోమరిని చేస్తుంది' అనుకుంటారు. నా యాంత్రీకరణ మానవ జీవితంలో ఒక భాగం ఐన నేపథ్యంలో మనిషి సుఖపడినట్టా? లేక సోమరితనంతో, లెక్కలేనన్ని రోగాలను తెచ్చుకుని, కృత్రిమంగా తగ్గించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాలా? చమురు బావుల వలన డబ్బు సంపాదించిన వారి పిల్లలు, మోటారు సైకిళ్ళ తిరుగుళ్ళు, ఆడపిల్లల వెంట వడబాణు, ప్రకృతి విధ్వంసం, మానవ సంబంధాలు చిద్రం కావడం, కథంతా చెప్పి చెప్పకుండా పరుచుకుంటాయి. పక్షళ్ళు నిజంగా అభివృద్ధి చెందాయా?" అని పాత్ర ద్వారా సందేహించినా, ఇది వాపే గాని బలుపు కాదేమోననే ఆలోచనను పాఠకుడికి కలిగిస్తారు రచయిత. మీనన్ గారి సమీప బంధువు, సోదరుడు, స్వర్గీయ కోనేటి మోహనరావు గారు, మన స్వతంత్రభారత మొదటి పార్లమెంటులో కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన సభ్యుడు. అందువల్ల ఇంటికి అనేకమంది పార్టీ సాయకుల రాకపోకలు, చర్చలు, చిన్ననాటి నుండి రచయితపై ఆనాడు భావజాల ప్రభావం పడడానికి అనుకూలించిందని చెప్పాలి. అందుకే వీరి కథలన్నింటా సింహభాగం ఆ భావజాల సువాసనలే వెనంటుతు మీనన్ భూకామందుల భూదాహానికి, అధికారాలకీ, అహంభావానికి బలి ఐన రైతు కూలీ కుటుంబాలు, బడుగు బలహీనవర్గాల జీవన విధ్వంసాలు, అన్నది ప్రభావంతో చైతన్య వంతులైన యువతరం హక్కుల పోరాటం చేయడం తిరుగుబాట గ్రామీణ జీవనం పట్ల, సమస్యలపట్ల ఖచ్చితమైన అవగాహన రచయిత .B. మీనన్ కు పది అందుకే లక్ష్మశతో పాఠకుడికి వివరించ దలచుకున్నదేమిలో చాలా స్పష్టంగా చెప్పడమే గార, తన పాఠకుడికి గాఢాని కలిగించి మమేకమయ్యేవిధంగా, కథారూపాన్నీ శిల్పించగల నేర్పు నదయిన గారలో వుంది. బావుటాలు ఎగర వేయటం, ఒక్కోసారి ఆయా పోరాటాల్లో బలికావటం వంటి అంశాలే ప్రధానంగా ఉంటాయి. కొన్ని కథల్లో సామాన్య కుటుంబ గాథలుగా చెప్పదగిన - వెన్నెల్లో తాజ్మహల్, వెలిగించని దీపాలు, వారది, ఇది స్త్రీకింగ్ కాదు, మౌనరాగం- వంటి కథలు వున్నా వాటిలో కూడా చర్చల ద్వారా, సంభాషణల ద్వారా రచయితకు గల హేతువాద దృక్పథం వ్యక్తం కావటం విశేషం! 'వెన్నెల్లో తాజ్ మహల్' కథలో షాజహాన్ ప్రేమికుడు కానేకాదని స్వార్థంతో తుచ్ఛమైన కోర్కెల కోసం వైద్య సలహాని విస్మరించి, ముంతాజ్ ను ఒత్తిడికి గురి చేసి వర్ద్నాలుగో నలో ఆమె మరణించడానికి, అతడే కారకుడని విమర్శనా పూర్వక చర్చతో తాజ్ మహల్ ప్రేమ చిహ్నం కాదంటూ తేలుస్తారు రచయిత. బడుగు వర్గాల ప్రజలు తనుపై దాడులను భరించలేక సహనం కోల్పోయిన పరిస్థితుల్లో తిరుగుబాటు చేయడం చాలా కథలలో ముక్తాయింపుగా చెబుతారు రచయిత. ఒక కథలో "తిరుగుబాటు అనేది ఉపన్యాసాలకీ, సిద్దాంత చర్చలకీ వచ్చి పడేది కాదు. వచ్చినా ఎక్కువకాలం నిలిచేది కాదు. దేనికైనా పరిస్థితులు పరిపక్వము కావాలి" అని ఒక పాత్ర చేత చెప్పించిన రచయిత, పరిస్థితులు పరిపక్వము అన క్రమం కూడా. మూలకథ గా తెలియజేస్తారు. బానిస మనస్తత్వం, సవారం గల పాత్రలు సైతం ఏవిధంగా తిరుగుబాటుకు సిద్ధం కావలసి వచ్చిందో కూడా చిన్న కథల్లోనే పొండు పరచి కళాత్మకం చేయటం లో రచయిత శైలీ నిర్మాణ పద్ధతికి మచ్చు తునకలుగా ఈ కథలు ఉంటాయి. ఒక వ్యక్తి తిరుగుబాటు చేసాడంటే ఆ వ్యక్తి పై ఎన్ని రకాల వైవిధ్య భరితమైన ఒత్తకు కారణభూతమౌతున్నాయో మీసన్ గారి కథలనుండి తెలుసుకోవచ్చును. అందుకు ప్రత్యేకంగా ఏ ఒక్క కథనో ఎంచుకోవలసిన అవసరం లేదు. ఈ కిటుకు కథలన్నీ చదివితేనే తన పరిశీల తన పరిశీలనలోని అంశాల్ని తన గ్రామీణ నేపథ్యాన్ని, పల్లెల్ని విషతుల్యం చేసే కుల- వర్గ విలక్షల్ని అక్కడ రాజ్యమేలే సమా తీరుతెన్నుల్ని- ఇలా రచయితను వెంటాడి ఉక్కిరి బిక్కిరి చేసిన అనేకానేక సంఘటనలని, వృశ్యాల్ని తాను సమ్మిన సిద్ధాంతాలకు జోడించి విజాయితీగా, నిష్కర్షగా శిల్ప విన్యాసంతో శక్తివంతంగా పాఠకులు కు తన కథలను - నవలలను అందించిన రచయిత కె. మీసెన్ అభినందనీయుడు. ప్రచార లోపం వల్ల ఈ రచయిత విస్తృత కథకుడిగా, నవలా కారుడిగా సాహిత్య చరిత్రలో మరుగున పడిపోకుండా చూసుకోవలసిన గురుతర బాధ్యత పాఠకులపైనా తోటి రచయితల పైనా ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. (శ్రీ కె. కె. మీనన్ వర్ధంతి -సృజన క్రాంతి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి