16, నవంబర్ 2023, గురువారం

పి.సరళాదేవి నవలిక- కొమ్మా- బొమ్మా

పి.సరళాదేవి-- "కొమ్మా-బొమ్మా" యువ1989లో తర్వాత పుస్తకంగా వచ్చింది. జగన్నాథం చిరుద్యోగి పెద్దకూతురు నాలుగో కాన్పుకు వస్తుంది.తర్వాతకూతురు మంగ, కొడుకు గోపి.ఇక్కడే ఉండే జగన్నాథం చెల్లెలు మీనాక్షమ్మ బాలవితంతువు తన బంధువుల అబ్బాయి తో పద్నాలుగేళ్ళ ఐనా లేని మంగకి పెళ్ళికుదురుస్తుంది.అయితే మందమతి అయిన పెళ్ళికొడుకు ఆ రాత్రే పారిపోయాడు.పెద్దకూతురు పాపని కని చనిపోతుంది.అల్లుడు పెద్ద పిల్లలిద్దర్నీ తీసుకుని వెళ్ళిపోయాడు.గోపి పదోతరగతి కాగానే డబ్బున్న స్నేహితుడి తండ్రి చదివించి కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తానంటే ఇల్లొదిలి వాళ్ళింటికి పోతాడు. మంగతల్లి బెంగ పెట్టుకొని చనిపోతుంది.అందరూ పిచ్చివాడి సంబంధం తెచ్చినందుకు మాటలంటున్నారని మీనాక్షమ్మ బంధువు ల ఇంటికి వెళ్ళిపోతుంది. అక్క పిల్లలిద్దర్నీ, రిటైరైన తండ్రి తో కాలం గడుపుతుంది మంగ. పక్క వాళ్ళ సలహాతో పదొతరగతి పరిక్షకట్టి టీచర్ ట్రైనింగ్ చేసి ఉద్యోగం సంపాదిస్తుంది.అలా పదిహేను ఏళ్ళు గడుస్తాయి.తండ్రి చనిపోతాడు.సహోద్యోగి మణి అన్న ఆనందరావు ,మంగ పట్ల ఆకర్షితుడయ్యాడు.కాని మంగ ఒప్పుకుంటుందో లేదో అని సంశయిస్తాడు. ఎలాగో మంగని పెళ్ళికి ఒప్పిస్తాడు. ఈ లోగా మంగ బావ వచ్చి తనవెంట వచ్చి పిల్లలను చూసుకోమని బలవంతం పెడతుంటాడు. అంతలో ఒక ముసలామె ఒకడ్ని మంగ భర్త అని తీసుకొస్తుంది. చుట్టూ పట్ల వాళ్ళందరూ భర్తనే నమ్ముకోమని ఉపదేశాలు ఇస్తారు.ఆనందరావు వస్తే అందరూ నిరసనగా చూస్తారు. చివరి కొన్నిపేజీలలో ఆమె సంఘర్షణ ఉంటుంది.భర్త అని వచ్చినవాళ్ళు తమ ప్రయత్నం ఆ ఇంట్లో సాగదని పక్క దుప్పట్లతో సహా ఎత్తుకు పోతారు. మంగ తండ్రి స్నేహితుడు వచ్చి" నువ్వు అదృష్టవంతురాలివి.నీ నెత్తిన మరో బండ పడకుండా తప్పించుకున్నావు." అంటాడు. మంగ బొమ్మలా ఉండిపోయింది.అని ముగించారు. నవలలో స్త్రీ జీవితాలగురించి, వైవాహిక బంధాలగురించి, మానవస్వభావాల గురించి మంచి విశ్లేషణలు ఉంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి