1, జులై 2020, బుధవారం

కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో స్త్రీ - పి. సరళాదేవి కథలు
  శీలా సుభద్రాదేవి

యాభయ్యవ దశకం తర్వాత సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన రచయిత్రులు కొందరు అనేక కారణాల వలన కొద్దికాలం మాత్రమే రచనలు చేసి అస్త్ర సన్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు. మరికొందరు తదనంతర నవలాప్రభంజనంలో కొట్టుకుపోతూ కీర్తీ, సంపదా లభించే ఆకర్షణలతో కథారచనను దూరంపెట్టినవాళ్ళూ ఉన్నారు. అతి తక్కువమంది ఒకటీ అరా నవలలు రాసినా కథారచనకే కట్టుబడినవారూ ఉన్నారు. అటువంటి వారిలో పి. సరళాదేవి ఒకరు. ఇతర ప్రక్రియలైన  కవితలు కొన్ని రాసినా, రెండు నవలికలు రాసినా మూడు కథల పుస్తకాలతో కథారచయిత్రిగానే గుర్తింపబడ్డారు.

1955లో ప్రజాతంత్ర పత్రికలో ‘బావ చూపిన బ్రతుకుబాట’ కథతో కథానగరంలోకి అడుగుపెట్టి, మాలతీచందూర్ ప్రోత్సాహంతో  ప్రమదావనంలో రచనలు చేసారు. డా. పి. శ్రీదేవి స్నేహప్రభావంతో తెలుగు స్వతంత్రలో 1955 నుండి 60 వరకూ విరివిగా కథలు రాసారు. ప్రముఖ పాత్రికేయుడు గోరాశాస్త్రి ముందుమాటతో తాను ఎంపిక చేసుకున్న కథల్ని 1962లో ‘కుంకుమరేఖలు’ పేరున సంపుటీకరించారు. మరికొన్ని కథల్ని ‘సరళాదేవి కథలు’ పేరుతో 1977లో మరొక సంపుటిని స్నేహితురాలు డా. పి. శ్రీదేవికి అంకితంగా తీసుకువచ్చారు. సరళాదేవి మరణానంతరం  ఆమె సోదరి ఆమెకు నివాళిగా, ఇంకా సంపుటీకరింపబడని కథల్ని ‘మాకుగాదులు లేవు’ పేరుతో ప్రచురించారు. కుంకుమరేఖలు సంపుటిలోని కథలు విజయవాడ ఆకాశవాణి ద్వారా ధారావాహికంగా ప్రసారం అయ్యి విశేషాదరణ పొందాయి.

1977లో ‘యువ’ మాసపత్రికలో ‘కొమ్మా-రెమ్మా’ పేరున నవలిక ప్రచురితం కాగా దానితోపాటు ‘చిగురు’ అనే నవలికనీ కలిపి గ్రంథస్థమై వచ్చాయి. ‘తెలుగు సామెతలు-సాంఘిక చిత్రణ’ అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని కూడా సరళాదేవి ప్రచురించుకున్నారు.

1956 నుండి 1960 వరకూ స్వాతంత్ర్యానంతరకాలం రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం నుండి కో��

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి