28, మే 2013, మంగళవారం

రచయిత్రి గంటివెంకటరమణకు అశ్రునివాళి

రచయిత్రి                                
గంటివెంకటరమణకు
అశ్రునివాళి


పాప్యులర్ రచనలతోనే కీర్తి కిరీటాలు అలంకరించుకున్న కొంతమంది రచయిత్రుల సరసన పే ర్కొనదగిన రచయిత్రి శ్రీమతి గంటి వెంకటరమణ కొద్దిపాటి ప్రతిభతో,ఒకటి రెండు ప్రచురణలతో,సాహిత్యరంగం లోకి చొచ్చుకొని పోయి వాక్చాతుర్యం తోనో ప్రముఖుల అండదండలతోనో సాహితీసంస్థల వెన్నుదన్నుతోనో అవకాసాలను కల్పించుకొని కొందరు ప్రముఖులుగా ఎదిగిపోతున్న సాహిత్యరంగంలొ అవేమీ పట్టించుకోకుండా వుపాధ్యాయ వ్రుత్తిని భుక్తి కోసమైతే ,మనసులోఎగసిపడే వూహావల్లరులను అవిశ్రాంతం గా నలభై ఏళ్ళకు పైగా అక్షరీకరించుకుంటూ 80 కి పైగా నవలలూ,అనేక కధలూరాసిన గంటి వెంకటరమణ నవలాప్రభంజనం నాటి పాఠకులకు తప్ప ఇతరులకు అనామకం గానే వుండిపోయింది.

బహుముఖప్రజ్ఞాశాలి ఐన వెంకటరమణ తన పిల్లలికి నటరాజరామక్రిష్ణ గారిదగ్గర న్రుత్యం నేర్పించటానికి తీసుకు వెళ్ళి ఆసక్తి తో తాను కూడా అభ్యసించింది.సంగీతం పై అభిరుచితో సంగీతసాధన చేసింది.భానుమతి పాటల్ని ముఖ్యం గా మల్లీశ్వరి పాటల్ని మధురం గా పాడేది.పాత హిందీ పాటలంటే ఆమెకు మరీ మరీ ఇష్టం.పాఠశాలలో పాఠాలు విద్యసంబంధమైన స్రుజనాత్మకమైన చార్టులతో పిల్లల్ని ఆకర్షించేది.ఇవన్నీ ఆమే విద్య,ఆసక్తులుగా అనుకుంటే వెంకటరమణ ప్రధానప్రవ్రుత్తి రచనావ్యాసంగం.

1966 లో ఆంధ్రప్రభ ఉగాది నవలలపోటీలో ఆనాటి రచయితలతో పోటీపడి "చదరంగం" నవలకుబహుమతి పొందింది. అప్పటి నుండి మరివెనుతిరగలేదు.ఆంధ్రప్రత్రిక,ప్రభ,యువ,స్వాతి,ఆంధ్రభూమి,చతుర వంటి ప్రముఖపత్రికలలోపుంఖానుపుంఖాలుగా నవలారచనలు చేసింది.సుమరు 80కిపైగానవలలు రాస్తే వాటిలొ మూడొంతులకు పైగా ధారావాహికలుగా రావటమేకాకవివిధ ప్రముఖ ప్రచురణ కర్తల ద్వారా పుస్తకాలుగారూపొంది65-75 మధ్య వువ్వేత్తున లేచిన నవలాప్రభంజనం లో తనకూ ఒక గుర్తింపుని సాధించుకొంది.

స్వాతి అనిల్ అవార్డ్ పోటీలలో మూడునాలుగు సార్లు మొదటి బహుమతిని సాధించుకొంది.అంతేకాక"అద్దెకు అమ్మానాన్న" అనే బహుమతి నవల స్వాతిలో ధారావాహికంగా వచ్చినప్పుడు దర్శకనిర్మాత కె.ఎస్.రామారావు స్వయంగా ఇంటికి వచ్చి 50,000రు తో నవలా హక్కులని కొనుక్కున్నారు.

గంటి వెంకటరమణ స్నేహశీలేకాక దగ్గరైన ప్రతీవారినీ దగ్గర బంధువరస తో పిలుస్తూ ఆత్మీయంగా దగ్గర అయ్యేది..ఆమే మాటలలో కల్మషం వుండదు.పసిపిల్లమనస్థత్వం కలిగి వుండేది.ఒకొక్కప్పుడు అమాయకం గా మాట్లాడె ఈమేనా ఇన్ని నవలలు రాసింది అనిపిస్తుంది.కానీ రచన చేయాలనుకున్నప్పుడు పాఠశాలలో ఎ ఖాళీ పిరియడు లోనో కూర్చొని ఒక ట్రాన్స్ లోకి వెళ్ళినట్లుగా పరిసరాలు పట్టించుకోకుండా పేజీలకు పేజీలు రాస్తుండేది.అవి చదివి ఏవైనా లోపాలుచెప్పినా సహ్రుదయం తో వాటిని అంగీకరించేది.

ఎవరికైనా ఏమైనా సరే అన్యాయం జరిగినప్పుడు వెంటనే పోరాటస్ఫూర్థి తో ముందుకి దూసుకువచ్చేది. ఆ విధం గానే తాను పని చేసిన పాఠశాల నిరంకుశ యాజమాన్యాన్ని ఎదిరించి సహచర ఉద్యొగినులతో కలసి పోరాటం జరిపి పాఠశాలమూయించి పోష్ట్ తోసహా ఆర్టీసి వున్నతపాఠశాలలో చేరింది.అన్యాయాలని ఎదుర్కోడానికి ముందుండే వెంకటరమణ సంప్రదాయాలకి భక్తిశ్రధ్ధలకి తలవంచింది.అవసరాలకోసం,ప్రేమానురాగాలకోసం జీవితంలో చాలా విలువైనవి కోల్పోయింది.ఒకసారి రచయిత్రుల సభలో పాల్గొనటానికి వెళ్ళి సాహిత్యానికి.జీవనవిధానానికి, ప్రవర్తనకి కనబడుతున్న వ్యత్యసాలు గమనించి సాహిత్యసభలకి, సంస్థలకి దూరంగా వుండాలని నిర్ణయించుకొంది వెంకటరమణ.

తర్వాత కాలం లో నేను ఎంతగా ప్రయంత్నించినా ఆమె సభలకి,సమావేశాలకి రావటానికి అంగీకరించలేదు.తన సాహిత్యం తో మమేకమై తన ఇంట్లోనే వుండటానికి ఇష్టపడేది.

పాప్యులర్ రచనలు చేసినవాళ్ళలో ఎంతోమందికి అనేక అవార్డులూ,సత్కారాలూ కొన్ని ప్రయత్నపూర్వకం గానో,ప్రతిభాపరం గానో వరిస్తునే వున్నాయి.మన రాష్ట్రం లోనే చిన్నవో పెద్దవో ప్రభుత్వపరమైనవీ,వివిధసంస్థలకి చెందినవీ అధిక సంఖ్యల్లోనే అవార్డులు ప్రతీ ఏడాదీ సాహితీవేత్తలకు ప్రకటింపబడుతున్నాయి.కానీ 40 ఏళ్ళకు పైగా అవిశ్రాంతంగా రచనలు సాగించిన శ్రీమతి గంటి వెంకటరమణకు ఒక్క అవార్డు ఐన రాకపోవడం బాధాకరమైన విషయమే.ఇందుకు ఆమే జనం లోకి రాక పోవడం ఒక కారణమైతే,65-80 లలోని పాఠకాదరణ తోనే ఆమే త్రుప్తి చెందడం మరోకారణం..

గంటి వెంకటరమణ నవలల్లో లయవిన్యాసం,మ్రుదంగతాళం,మొగలిపొదలు,పూదోతలో గంటు ముళ్ళు,జీవనధార,భవభందాలు , పేయింగ్ గెస్ట్,డాక్టర్ కరుణ,,హొటల్ కార్నర్,గాజుబొమ్మలు,మరుద్వతీకన్య ప్రణయగాధ అత్యంత గుర్తింపు పొందినవి.2005 తర్వాత అప్పుడప్పుడు రాసినా పార్కిన్ సన్ వ్యాధి బారిన పది కలానికి విశ్రాంతి ఇవ్వక తప్పలేదు.

ఆమె తో సుమారు 15 సంవత్సరాల పాటు సహ వుధ్యోగిని గానే కాక తదనంతరమూ సాహిత్యసాన్నిహిత్యం,స్నేహబంధం కలిగి వున్నందుకు సాహిత్యరంగం తరపున శ్రీమతి గంటి వెంకటరమణకు ప్రేమతో నా ఈ అశ్రునివాళి

-_శీలా సుభద్రాదేవి







27, మే 2013, సోమవారం

oka vudayam kosam

ఒక వుదయం కోసం



కొత్తగా రెక్కలు విప్పుకొన్న పక్షులై ఆలోచనలన్నీ

జీవన వౄక్షమంతా ఎగురుతూదూకుతూ

కొమ్మకొమ్మనీ తడుముతూ

పత్రావిష్కారాల్ని చేస్తున్నాయ్

అప్పుడప్పుడే

విచ్చుకొంటున్న చిగురాశల్ని

రెక్కల్తో విసుర్తూ రెపరెపలాడిస్తున్నాయ్

కొత్తగా తొడిగిన మొగ్గల్ని ముద్దాడుతూ

ఫలించిన స్వప్నఫలాల్ని అబ్బురంగా చూస్తూ

వసివాడి రాల్తోన్న పండుటాకులకి

చెమ్మగిల్లిన హృదయం తో వీడ్కోలు పలుకుతూ

రాత్రంతా కలయతిరుగుతూనే వున్నాయ్



పొద్దంతా అలసి పోయిన శరీరం

విశ్రాంతిని కలవరిస్తూ

అస్తిరంగా పక్క మీద మెలికల పామై

లుంగలు చుట్టుకొంటోంది

ఎంతకీ రాని నిద్ర కోసం

ఎదురుచూసి ఎదురుచూసి

విసిగి వేసారి డస్సిపోయిన

విరహోత్కంటితలా కంటిపాప

రెప్పలతలుపుల్ని బార్లాతెరచి

చూపుకి చేరబడి గుమ్మం దగ్గరే కూలబడింది



రేపటి తొలి వేకువకి

నవచైతన్యం తో ఆహ్వానగీతికల్ని

ఆలపించిస్వాగతించడానికి

తగినశక్తిని సమకూర్చమనినిద్రని వేడుకొంటూ

మనసు మౌనముద్రని ధరించి

వుండుండి గుండె షహనాయ్ ని వూదుతూ

సావేరీరాగాలాపన సాగిస్తోంది

నన్నూ నా ఆలోచనల్నీ జోకొడ్తూ

నిద్ర అమ్మై తన ఒడిలోకి

ఎప్పుడు పొదువుకొంటుందో